సూర్యదేవాలయం
క్రీ.పూ 1025-1026 ప్రాంతంలో సోమనాథ్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను మహమూద్ గజనీ ఆక్రమించుకోవడంతో పోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు. పోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుణ్ణి తమ కులదేవతగా కొలిచేవారు. కాబట్టి వారి ఆరాధ్య దైవమైన సూర్యుణ్ని కొలిచేందుకు ఓ అందమైన సూర్య మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. అదే సమయంలో పోలంకి రాజధానిగా చెప్పుకునే అహిల్వాడ్ పాటణ్' కూడా తన గొప్పదనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోవడం మొదలైంది. తమ పూర్వ వైభవాన్ని కాపాడుకునేందుకు పోలంకి రాజ కుటుంబం, అక్కడి వ్యాపారులు ఓ జట్టుగా ఏర్పడి అందమైన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ విధంగా మోడేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది.
No comments:
Post a Comment